సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
బుడ్డోని కుంట సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం శాంతినగర్ కాలనీలో ఉన్నటువంటి బుడ్డోనికుంట సమస్యను మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నటువంటి బుడ్డోనికుంట సమస్యను పరిష్కరించామని చెప్పారు. గత కొన్ని సంవత్సరాల కిందట కుంటలోకి వర్షపు నీరు నిలిచి ఉండడం వల్ల పశువులు తాగేవని, చేపలు కూడా పెంచేవారని, ఇప్పుడు ప్రధాన మూడు మురికి కాల్వ నీరు కుంటలో కలవడం వల్ల నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈవిషయాన్ని దృష్టిలో పెట్టుకొని కుంటలో కలుస్తున్న మురికి కాల్వ నీరును తాత్కాలిక డ్రైనేజీ ఏర్పాటు చేసి కుంటలో కలవకుండా చేయించామని తెలిపారు .ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్ నాయకులు పరిమి సురేష్ , మున్సిపాలిటీ అధికారులు మనల శంకర్ ,నాయకులు నవీన్, సాయి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.