సిరా న్యూస్, ఖానాపూర్టౌన్
బోడ్డోని కుంటను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం శాంతి నగర్ కాలనీలోని బోడ్డోని కుంటలోకి డ్రైనేజీ మురికి నీరు వచ్చి కుంటలో నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తుందని కాలనీవాసులు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కు తెలియజేశారు. స్పందించిన చైర్మన్ సోమవారం కుంట వద్దకు వచ్చి డ్రైనేజీ మురికి కాలువాలను పరిశీలించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కుంటలోకి మురికి నీరు వచ్చి నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తుందని, మొదటగా మురికి కాల్వాల నీరు కుంటలోకి రాకుండా వేరే దిశగా నీటిని మల్లిస్తామని చెప్పారు. ఎవరైనా కుంటలో వ్యర్ధాలు చెత్తాచెదారం వేస్తే మున్సిపాలిటీ కార్యాలయంలో లేదా తమకు తెలియజేశాలని చెప్పారు. మున్సిపాలిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్ నాయకులు కుర్మా శ్రీనివాస్ , జన్నరపు శంకర్ , పరిమి సురేష్ , షబ్బీర్ పాషా , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , సలీం ఖాన్ ,శాంతి నగర్ కాలనీ వాసులు, గంగపుత్ర సంఘం అధ్యక్షులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.