సిరా న్యూస్, ఖానాపూర్ టౌన్
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
ఇంద్రానగర్ కాలనీలో డ్రైడే కార్యక్రమం
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 11 వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలో, 5వ వార్డు ఇంద్రానగర్ కాలనీలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మాట్లాడుతూ ప్రజలు ప్రతి ఒక్కరు వర్షాకాలం ని దృష్టిలో ఉంచుకుని కూలర్లు, పాత టైర్లు పనికిరాని వస్తువులలో నిల్వ ఉన్నటువంటి వర్షపు నీటిని తొలగించాలని లేకపోతే వాటిపై అనేకమైన బ్యాక్టీరియా వైరస్ ఏర్పడి దోమలు ఏర్పడతాయని తెలిపారు. వాటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారని, ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. సీజనల్ వ్యాధులకు గురి కాకుండా చూసుకునే బాధ్యత మన అందరి పైన ఉంటుందని అన్నారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , 5వ వార్డు కౌన్సిలర్ పరిమి లత సురేష్ , నాయకులు చరణ్ , మున్సిపాలిటీ అధికారులు వార్డు ఆఫీసర్లు రమేష్, రాజేంద్రప్రసాద్, ఆశా వర్కర్లు అంగన్వాడి, మెప్మా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.