సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఐదవ వార్డులో పిచ్చి మొక్కలు తొలగింపు: మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఇంద్రనగర్ , గంగపుత్ర కాలనీలో పిచ్చి మొక్కలు పెరిగి పాములు, విషపురుగులు తిరుగుతున్నాయని కాలనీవాసులు వార్డ్ కౌన్సిలర్ దృష్టికి తీసుక వచ్చారు. వెంటనే ఈ విషయాన్ని వార్డ్ కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మున్సిపల్ చైర్మన్ శుక్రవారం జేసీబీతో పిచ్చి మొక్కలను తొలగింపుజేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , వార్డు కౌన్సిలర్ పరిమి లత సురేష్ , వార్డు ఆఫీసర్ రాజేందర్ ప్రసాద్ , కాలనీవాసులు ఉషల్ వార్ లాలు మెయిన్గు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.