సిరాన్యూస్, ఖానాపూర్
ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం 11వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో మంగళవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించాలని అన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలలో , ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాలలో మొక్కలను నాటాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల టీచర్ గేయలత , అంగన్వాడి టీచర్ విజయ లక్ష్మి , పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.