సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
చేతి పంపుల ఏర్పాటుకు స్థల పరిశీలన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 8వ వార్డులో తాగునీటి సమస్యను తీర్చేందుకు చేతి పంపుల ఏర్పాటు కోసం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం సోమవారం స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఆదేశాల మేరక తాగునీటి సమస్య ఉన్న ప్రతి వార్డులో తాగునీటి బోర్లు వేయాలని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు స్థలాలను పరిశీలించామని అన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ , వార్డు స్పెషల్ ఆఫీసర్ పద్మ , కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.