Rajura Satyam: ప‌ట్ట‌ణంలోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తా: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ప‌ట్ట‌ణంలోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తా: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
* మున్సిప‌ల్ సర్వసభ్య సమావేశం

ప‌ట్ట‌ణంలోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మంగళవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అధ్యక్షతన సర్వ సభ సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖానాపూర్ పట్టణంలో ఉన్న పలు సమస్యల రోడ్ల పైన రోడ్ల మీద తిరుగుతున్న పశువుల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని, ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జూ పటేల్ సహకారంతో 12 వార్డులలో నూతన తాగునీటి బోర్లు, వాటికి మోటార్స్ పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని, వార్డులలో ఉన్న ప్యాచ్ వర్క్ ల మీద పలు అభివృద్ధి పనుల పైన సర్వ సమావేశం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నాయకులు కారింగుల సంకీర్తన సుమన్,జన్నారపు విజయలక్ష్మి శంకర్ , నాయిని స్రవంతి సంతోష్ , పరిమి లత సురేష్ , ఆఫ్రిన్ అమానుల్లా ఖాన్ , కిషోర్ నాయక్ , అబ్దుల్ కలీల్ , కుర్మా శ్రీనివాస్ , ఫౌజియా షబ్బీర్ పాషా , కో ఆప్షన్ సభ్యులు బండారి కిషోర్ ,మున్సిపల్ కమిషనర్ మనోహర్ , మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *