RAJURA SATYAM: తాగు నీటిని అందిస్తాం

సిరాన్యూస్‌, ఖానాపూర్ 
తాగు నీటిని అందిస్తాం
* మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
* పైప్ లైన్ పనుల ప‌రిశీల‌న

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద జరుగుతున్న తాగునీటి పైప్ లైన్ పనులను శుక్రవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్ సహాయ సహకారాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద నీటి సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. వచ్చే ఎండాకాలంలో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తగా పైప్ లైన్ఏర్పాటు చేసి నీటిని అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కుర్మా శ్రీనివాస్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , ఏఈ తిరుపతి , మున్సిపాలిటీ వాటర్ సప్లై సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *