సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
చలివేంద్రం ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్మన్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయ తరపు నుండి ఏర్పాటు చేసిన రెండు చలివేంద్రాలను గురువారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎండాకాలంను దృష్టిలో ఉంచుకుని ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రజలకు అందుబాటులో తాగునీటి చలివేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్ నాయకులు నాయిని సంతోష్ , పరిమి సురేష్ , షబ్బీర్ పాషా , మండల అధ్యక్షులు దొనికేనీ దయానంద్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, నాయకులు తోట సత్యం, కంఠం రవి, కడార్ల గంగా నరసయ్య, జహీర్ ఖాన్, మడిగేల గంగాధర్, సలీం ఖాన్, షౌకత్ పాషా, రాజేందర్, శనిగరపు కమలాకర్, రమేష్, శ్రీనివాస్, జహీర్, తదితరులు పాల్గొన్నారు.