సిరా న్యూస్, ఖానాపూర్:
బస్ స్టాప్ ఏర్పాటు కోసం స్థలం పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో “బస్ స్టాప్ లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు” శీర్షికన సిరా న్యూస్ లో ప్రచురితమైన కథనానికి, మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం స్పందించారు. స్థానిక విద్యానగర్ కాలనీలో తాత్కాలిక బస్ స్టాప్ నిర్మాణం కోసం ఆదివారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని విద్యానగర్ కాలనీలో తాత్కాలిక బస్ స్టాప్ ఏర్పాటుకు స్థలం పరిశీలించామని అన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి పట్టణంలో చేపట్టిన రోడ్డు వెడల్పు పనులలో బస్ స్టాప్ ను తొలగించగా అప్పటినుండి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు తాత్కాలిక బస్టాప్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జన్నారపు శంకర్, నాయిని సంతోష్, పరిమి సురేష్, తదితరులు, పాల్గొన్నారు.