కల్లూరు మండలం నాయకులతో సమావేశమైన సండ్ర వెంకటవీరయ్య
సిరా న్యూస్,ఖమ్మం;
పట్టభద్రులు ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తూ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్ ను కలిసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరాలని కల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల నాయకత్వానికి సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. సిట్టింగ్ స్థానాన్ని మల్లోసారి కైవసం చేసుకోవడానికి ప్రతి ఒక్క బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు.