Rakesh Yadav:గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలి

సిరాన్యూస్‌, సైదాపూర్
గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలి
హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీనవేని రాకేష్ యాదవ్

కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీనవేని రాకేష్ యాదవ్ అన్నారు..రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా శ‌నివారం హుస్నాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీనవేని రాకేష్ యాదవ్ అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీనవేని రాకేష్ యాదవ్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా చేసుకుని ప్రతి యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసిన విధంగా బూత్ జోడో ద్వారా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని అని పిలుపునిచ్చారు , పార్లమెంట్ ఎన్నికల కోసం వెంటనే డోర్ టు డోర్ ప్రచారం మొదలు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటిల గురించి విశృతంగా ప్రచారం చేయాలని బీజేపీ , బీఆర్ఎస్ చేస్తున్న అబద్దపు ప్రచారాలను తిప్పి కొట్టి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రచారం వేగవంతం చేయాలని కోరారు. బీజేపీ చేస్తున్న విద్వేష రాజకీయాలు తిప్పి కొట్టి ప్రజలకు నిజానిజాలు తెలిసేలా కాంగ్రెస్ పార్టీ తరుపున పని చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రాముడి పై అయోధ్య రామమందిరం నీ అడ్డం పెట్టుకోని వచ్చే ఎన్నికలలో తమ ప్రచారం లో వాడుకొని ప్రయోజనం పొందాలి అని చూస్తున్న బీజేపీ నాయకులను ఇంటికి పంపించే వరకు యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రమించాలని కోరారు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని నియమించిన అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాంతల శివారెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కో ఆర్డినేటర్ చిదురాల సురేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శులు బోయిని నరేష్, లావుడ్య జవహర్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మ్యాదరబోయిన శ్రీకాంత్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ కార్యదర్శులు పోగుల కుమార్, బూరుగు సతీష్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్నవేని విద్యాసాగర్, చిగురుమామిడి మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి యాదగిరి, సైదాపూర్ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆసరి రఘు, ఎల్కతుర్తి మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హింగే శ్రీకాంత్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు అంబాల శ్రీకాంత్ , వరుకోలు సంతోష్, ముంజ శివ సాయి, మారుపాక గణేష్, కమల్, బోయిని వేణు, గట్టు ప్రశాంత్, రమేశ్ నాయక్, నగేష్, కూన విశ్వతేజ, చొక్కం గణేష్, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *