సిరా న్యూస్,హైదరాబాద్;
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులు సచివాలయానికి భారీగా తరలి వెళ్లారు. హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద టిపిసిసి అధికార ప్రతినిధి, ఓయూ జేఏసీ చైర్మన్ లోకేష్ యాదవ్ ఆధ్వర్యంలో సచివాలయానికి విద్యార్థులు నిరుద్యోగులు భారీగా బయలుదేరి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కను సన్మానించి అనంతరం నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లోకేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీలకు 60 శాతం అవకాశాలు కల్పిస్తారని ఆకాంక్షిస్తున్నామన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అన్యాయాలను ఎండగడుతూ మల్లు బట్టి విక్రమార్క 360 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించారు అందుగ్గాను ఈరోజు సచివాలయంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను సన్మానించామని వెల్లడించారు.