సిరా న్యూస్, గుడిహాత్నూర్:
రామ్ మందిర్ జాతరకు తరలి రావాలి…
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రామ్ మందిర్ జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు కోరారు. బుధవారం నుండి రామ్ మందిర్ లో వారం రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భజనలు, కీర్తనలు తో పాటు జాతర నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా ఉచిత బస్సు సర్వీసులను సైతం ప్రారంభించిందని, భక్తులంతా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆలయంలో ప్రతిరోజు మహాన్నదానం నిర్వహించడం జరుగుతుందని, భక్తులంతా పెద్ద ఎత్తు తరలిరావాలని కోరారు.