సిరాన్యూస్, ఓదెల
రామగుండంలో సీఎం దిష్టిబొమ్మ దహనం
సీఎం మహిళ ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కలు మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడినందుకు నిరసనగా పెద్దపల్లి బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం రామగుండం గాంధీ చౌరస్తా వద్ద పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణ లోకం చూస్తూ ఉండగా మహిళలోకాన్ని అవమానిస్తూ మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి వెంటనే మహిళలోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.మహిళ నేతలను ఇంత చులకనగా మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు వారిద్దరిపై మాత్రమే కాదు మొత్తం మహిళలపై వారికున్నా చులకన భావాన్ని తెలియజేస్తుందన్నారు. కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిని మహిళలంతా గమనిస్తున్నారని చెప్పారు. వారికి సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పెద్దపెల్లి నియోజకవర్గం నాయకులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, వార్డ్ మెంబర్లు మహిళా నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.