Ramakrishna Reddy: సకాలంలో అర్జీలను పరిష్కరించాలి

సిరా న్యూస్, అనంతపురం
సకాలంలో అర్జీలను పరిష్కరించాలి
* డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి
సకాలంలో అర్జీలను పరిష్కరించాలని డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి అన్నారు. సోమ‌వారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ప్రజల నుంచి డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి అర్జీలను స్వీకరించారు.ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, ఆర్డీఓ జి.వెంకటేష్, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 255 అర్జీలను జాయింట్ కలెక్టర్ స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా గడువులోపు అర్జీల పరిష్కారం చేయాలని, నాణ్యతగా అర్జీలకు పరిష్కారం చూపించాలన్నారు. ప్రతినిత్యం మానిటర్ చేస్తూ అర్జీలకు పరిష్కారం చూపించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *