సిరా న్యూస్, జైనథ్:
పిప్పర్ వాడ రామాలయంలో ఆధ్యాత్మిక శోభ…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పరవాడ గ్రామంలోని రామాలయంలో ఆధ్యాత్మిక సంతరించుకుంది. హనుమాన్, రామ దీక్షాపరులు ప్రతిరోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండడంతో, పూజలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గురువారం మహిళలు ఇంటి వద్ద నుండి మంగళ హారతులతో శోభాయాత్రగా ఆలయానికి చేరుకొని, సీతారాములను దర్శించుకున్నారు. రామనామ జపం చేస్తూ తన్మయత్వంతో రామున్ని కొలిచారు. అనంతరం స్వామి దీక్షాపరులు, స్థానికులు పెద్ద ఎత్తున భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ప్రసాద వితరణ గావించారు. కాగా రామ నవమి వరకు ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఏడాది రామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నారు.