సిరా న్యూస్, చిగురుమామిడి
పేదల కోసమే ఉచిత కరెంటు
కాంగ్రెస్ బొమ్మనపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు మాచమల్ల రమణయ్య
గృహ జ్యోతి జీరో బిల్లు అందజేత
రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేస్తుందని కాంగ్రెస్ బొమ్మనపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు మాచమల్ల రమణయ్య తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలుపట్ల సంతోషం వ్యక్తం చేశారు.జీరో బిల్లు రసీదును గ్రామస్తులకు అందించారు.వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు చేస్తుందని… ప్రతి పేదవాడికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మామిడి చంద్రమౌలి కోమల, మడమడల రాజిరెడ్డి, కత్తుల దేవేందర్, మా చమల్ల కిషోర్, బద్దిపడగ మల్లికార్జున్ రెడ్డి,
సదానందం, గ్రామ హెల్పర్ విజేందర్, తదితరులు పాల్గొన్నారు.