Ramarapu Venkatesh: వేస‌వి త‌ర‌గ‌తులు నిర్వ‌హించే క‌ళాశాల‌ల‌ గుర్తింపు ర‌ద్దు చేయాలి

సిరాన్యూస్‌, హుజురాబాద్:
వేస‌వి త‌ర‌గ‌తులు నిర్వ‌హించే క‌ళాశాల‌ల‌ గుర్తింపు ర‌ద్దు చేయాలి
* ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్

ముందస్తు అడ్మిషన్లు ,వేసవి తరగతులు నిర్వహిస్తున్న కార్పోరేట్ జూనియర్ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పోరేట్ కళాశాలలకు ఇంటర్ బోర్డు అడ్డుకట్ట వేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ అన్నారు. శ‌నివారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ జిల్లాల్లో ప్రైవేట్ జూనియర్ కళాశాలలలు ఇంటర్ బోర్డు నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ముందస్తు అడ్మిషన్లు, వేసవి తరగతులు నిర్వహిస్తున్నార‌న్నారు.ఇప్పటికే కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు ఇంకా ఫలితాలు రాకముందే రెండవ సంవత్సరం తరగతులు నిర్వహిస్తూ,ఒక్కో విద్యార్ధి నుండి 50% శాతం ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా నిబంధనలు పాటించని జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *