Ramarapu Venkatesh: బీఅర్ఎస్, బీజేపీ పార్టీలను ఓడించండి : సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామారపు వెంకటేష్

సిరాన్యూస్‌, హుజురాబాద్
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఓడించండి : సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామారపు వెంకటేష్
విద్యార్థి, నిరుద్యోగులను విస్మరించిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు
కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావునే గెలిపించండి

తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఉండి కూడా విద్యార్థి, నిరుద్యోగయువతను విస్మరించిందని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామారపు వెంకటేష్ అన్నారు. గురువారం హుజురాబాద్ నియోజకవర్గంలోని 16వ వార్డు, కూరగాయల మార్కెట్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుని గెలిపించాలని సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం రామారపు వెంకటేష్ మాట్లాడుతూ 2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని బీఆర్ఎస్ పార్టీనీ, కేసిఆర్ నీ ఓడించడానికి విద్యార్థి, నిరుద్యోగులు సిద్దం కావాలన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్,బీజేపీ అభ్యర్థులను ఓడించి, కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు నీ గెలిపించాలని పిలుపునిచ్చారు. విద్యార్థి, నిరుద్యోగుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ కుటుంబ, అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. బీజేపీ పార్టీ మతపరమైన ప్రచారం చేస్తుందని, రాముడి పేరుతో రాజకీయ చేస్తుందని కరీంనగర్ కి బండి సంజయ్ ఈ పది సంవత్సరాలలో ఏం చేశారని ప్రశ్నించారు. మతపరమైన రాజకీయాలను ఓడించాలని అన్నారు. ప్రజా పాలన చేస్తు ప్రజలకు, పేదలకు, అన్నదాతలకు, అందుబాటులో ఉండేదే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కరీంనగర్ జిల్లా లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తేనే అభివృద్ధి జరుగుతుందని విద్యార్థులకు, పేదలకు అన్నదాతలకు, మళ్ళీ ఇందిరమ్మరాజ్యం వస్తుందని అన్నారు. కార్యక్రమంలో ప్రచారంలో సీపీఐ పట్టణ కార్యదర్శి ముత్త రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్, సీపీఐ నాయకులు అన్నే ఐలయ్య, కన్నే బోయిన మలయ్య, ఎల్లమ్మ, జల్ల గీత, రజిత,వనిత, సాహెబ్, రాజు, మంజీర రెడ్డి , మంజుల రెడ్డి, శ్రీకాంత్, అఖిల రెడ్డి బండ మమ్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *