సిరాన్యూస్, హుజురాబాద్:
ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం దృష్టి సారించాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్
* ప్రభుత్వ పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించాలి
ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మంగళవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణం లోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల లలో మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు ను కోన్ని పాఠశాలల్లో వేయడం లేదని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని కోడిగుడ్డును అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పించాలని, కొన్ని పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటికి నూతన భవనాలు నిర్మించాలని అన్నారు. మంచినీటి సౌకర్యం లేక విద్యార్దులు ఇబ్బంది పడుతున్నారని ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేయాలని కోరారు. పాఠశాలలో అటెండర్, పీటీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వం చేపట్టిన మన ఊరు…మన బడి…పథకం ద్వారా సమస్యలను పరిష్కరించి ప్రతి పాఠశాలలో ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం చూడాలని వెంకటేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్, మండల అధ్యక్ష కార్యదర్శులు దోమ్మాటి వేణుగోపాల్, జూపాక శివమణి, మండల సహాయ కార్యదర్శి రాపేల్లి రోహిత్, నాయకులు సందీప్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.