సిరాన్యూస్, కుందుర్పి
ఆదరించండి… అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే అభ్యర్థి రాంభూపాల్ రెడ్డి
* కుందుర్పిలో విస్తృత ప్రచారం
ఆదరించండి… అభివృద్ధి చేస్తానని కళ్యాణదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంభూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం కుందుర్పి మండలంలోని కంబదూరు, నూతిమడుగు, తిప్పేపల్లి ,కర్తనపర్తి, డి సి పల్లి ,రాళ్ల అనంతపురం, అచ్చంపల్లి, చెన్నంపల్లి ,కురాకులపల్లి తదితర గ్రామాలలో కళ్యాణదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంభూపాల్ రెడ్డి ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణం మాఫీ కావాలన్నా, ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయల మొత్తం అందాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరీం, రిటైర్డ్ ఎమ్మార్వో తిమ్మప్ప,ఎర్రకొండాపురం క్రిష్ణమూర్తి,కంబదూరు దామోదర్, ఓబగానపల్లి ముత్యాలప్ప, యాటకల్లు ఈరన్న ,రిటైర్డ్ విఆర్వో కుందుర్పి తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.