Rambhupal Reddy: ఆద‌రించండి.. అభివృద్ధి చేస్తా:  ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటంపల్లి రాంభూపాల్ రెడ్డి

సిరాన్యూస్, కుందుర్పి
ఆద‌రించండి.. అభివృద్ధి చేస్తా:  ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటంపల్లి రాంభూపాల్ రెడ్డి
మండలంలో విస్తృత ప్ర‌చారం

ఆద‌రించండి.. అభివృద్ధి చేస్తాన‌ని కళ్యాణదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటంపల్లి రాంభూపాల్ రెడ్డి అన్నారు. బుధ‌వారం కంబదూరు కుందుర్పి మండలంలో కుర్లపల్లి,మంద ,అండేపల్లి, కంబదూరు, కొత్తపల్లి, జెక్కిరెడ్డిపల్లి,ఓబగానపల్లి, తిమ్మాపురం, కదిరిదేవరపల్లి, ములకనూరు, గుద్దెళ్ల, మర్రిమాకులపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటంపల్లి రాంభూపాల్ రెడ్డి విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రత్యేక హోదా సాధించాలన్నా, ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ కావాలన్నా,ప్రతి ఏడాదికి పేద మహిళ పేరిట లక్ష రూపాయలు ఆర్థిక సాయం కావాలన్నా,కేవలం 500 రూపాయల కే గ్యాస్ కనెక్షన్ కావాలన్నా, కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో ప్రతి చెరువుకు సాగునీరు,ప్రతిఇంటికి మంచినీటి కొళాయి కావాలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల‌న్నారు. పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ సమస్య తీర్చాలన్నా,మే నెలలో 13న జరుగబోవు సార్వత్రిక ఎన్నికలలో ఈవిఎంలో ఉన్న క్రమ సంఖ్య -3 వద్ద కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన హస్తం కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను రెండు చేతులు జోడించి అభ్యర్థించారు. కార్య‌క్ర‌మంలో క‌న్వీన‌ర్లు ఈరన్న,మల్లయ్య, క్రిష్ణమూర్తి ,కరీం ,దామోదర్ ఓబగానపల్లి ముత్యాలప్ప, యాటకల్లు ఈరన్న,అండేపల్లి రవి, లింగన్న యాదవ్ ప్రచారంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *