Ramesh: పిల్ల‌ల‌ను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి: ప్రధానోపాధ్యాయులు రమేష్

సిరాన్యూస్, ఇచ్చోడ‌
పిల్ల‌ల‌ను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి: ప్రధానోపాధ్యాయులు రమేష్

ప్రతి ఒక్కరూ తమ పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రధానోపాధ్యాయులు రమేష్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు గురువారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ మన ఊరు – మన బడి ద్వార పాఠశాలలో వచ్చిన మార్పు ఆహ్లాదకర వాతావరణం గురించి తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారనే మంచి విద్యా అందుతుందన్నారు. ప్రతీ ఒక్కరు తమ పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్యాంసుందర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆదర్శ కమిటీ, స్వయం సహాయక సంఘం సభ్యులు, అంగన్వాడి టీచర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *