Ramesh:బోథ్ తై బజార్ వేలం: ఎంపీడీవో రమేష్

సిరా న్యూస్, బోథ్‌
బోథ్ తై బజార్ వేలం: ఎంపీడీవో రమేష్
రూ.4,11,500ల‌కు ద‌క్కించుకున్న‌ సోలంకి రాముడు

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో ప్రతి మంగళవారం నిర్వహించే వారసంతకు శనివారం వేలం పాట నిర్వహించారు. ఎంపీడీవో రమేష్ , ఈవో అంజయ్య ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించగా, వేలం పాటలో వడ్లకొండ సురేందర్, అనిల్ కుమార్, రఫీ, మహమ్మద్, సోలంకి ఘనశ్యామ్, పాన్ పట్టి రాజు, ఈరన్నల రమేష్, పవర్ గోవింద్ రాములు 9 మంది వేలం పాటలో పాల్గొన్నారు. వేలంపాటలో తైబజార్ బోథ్‌ కు చెందిన సోలంకి రాముడు 4,11, 500 రూపాయలకు దక్కించుకున్నారు. అయితే ఈ నెల 9న తైబజార్ కాలపరిమితి ముగిసిపోనుంది. కాగా సంతలో సరైన వసతులు లేవని ముఖ్యంగా మూత్రశాలలు మరుగుదొడ్లు నిర్మించాలని వ్యాపార వర్గాల వారు కోరుతున్నారు. ప్రతి నెల డబ్బులు చెల్లిస్తున్న వసతులు మాత్రం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *