Ranga Srinivas Chari: మల్లికార్జున స్వామి దర్శించుకున్నజిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్ చారి

సిరా న్యూస్, ఓదెల
మల్లికార్జున స్వామి దర్శించుకున్నజిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్ చారి

ఓదెల శ్రీ మల్లికార్జున స్వామినీ శనివారం పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాసాచారి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వానికే కాలజ్ఞానం నేర్పిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారసులమ‌ని తెలిపారు. స్వాతంత్రం వచ్చి ఏళ్ళు గడుస్తున్న కులవృత్తి చేసుకునే జీవిస్తున్నామ‌ని తెలిపారు. విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వ నుండి ఎలాంటి సహయ సహాకారాలు అందడం లేదని తెలిపారు. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన కులవృత్తి చేసుకునే మా బ్రతుకులు మారటం లేదన్నారు. ప్రజా పాలనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని స్వామివారిని వేడుకోవడం జరిగిందని తెలిపారు. వీరు వెంట ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు రాజు, ఓదెల మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులు వెలిషోజు రవీంద్ర చారి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చారి, ఉపాధ్యక్షులు బ్రహ్మచారి, కోశాధికారి కొండపాక నరసింహ చారి తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *