Rangineni Sudhir Rao: పంట వ్యర్ధాలను పొలంలో కాల్చ‌వ‌ద్దు

సిరా న్యూస్, బేల‌
పంట వ్యర్ధాలను పొలంలో కాల్చ‌వ‌ద్దు
*  సీఈఓ రంగినేని సుధీర్ రావు
రైతులు పంట కోత అనంతరం పంట వ్యర్ధాలను పంట పొలంలో కాల్చివేయడం సరికాదని శివ్ బేల రైతు ఉత్పాదక కంపెనీ సీఈఓ రంగినేని సుధీర్ రావు అన్నారు.ఆదిలాబాద్ జిల్లా బేల మండ‌లంలోని కొబ్బాయి గ్రామంలో శివ్ బేల రైతు ఉత్పాదక కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా సీఈవో మాట్లాడుతూ.. రైతులు లోతైన దుక్కులను ముందుగానే చేసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.పంట కోత అనంతరం పంట వ్యర్ధాలను పంట పొలంలో కాల్చివేయడం వ‌ల్ల‌  భూమిలో ఉన్న సేంద్రియ పదార్థాలు ,సూక్ష్మధాతు పోషకాలు, ప్రధాన పోషకాలు అంతరించే అవకాశం ఉందన్నారు. వచ్చే ఖరీఫ్ మాసంలో రైతులకు సకాలంలో ఎరువులు ఇవ్వడమే కాకుండా కొత్త కొత్త పంటల మీద అవగాహన క‌ల్పిస్తామ‌ని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గేడం మనోజ్, గడ్డం రామేశ్వర్, రామేశ్వర్ దాస్, దేవరావు , మనోజ్ విశ్వాస్ ,అనురాధ , సోమ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *