సిరా న్యూస్, ఓదెల
పేదింటి ఆడబిడ్డకు పుస్తే మట్టేలు అందజేత
* వివాహం కోసం అండగా నిలిచిన కుల బాంధవులు
ఓదెల సోమవారం మండల కేంద్రానికి చెందిన వెలి శో జు ఉమాదేవి శంకరాచారి వారి కుమార్తె మౌనిక వీరి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నందున పెద్దపల్లి జిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పుస్తె మట్టేలు వారి కుటుంబానికి అందజేశారు.సుల్తానాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న)25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు.అలాగే విజయగిరి శ్రీనివాస్ గడ్డం వెంకటేశ్వర్లు 50 కిలోల బియ్యాన్ని ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని స్వర్ణకారుల కుటుంబంలో ఎవరికి ఏ బాధ వచ్చినా అండగా మేము ఉంటామని మా వంతు ఆర్థిక సాయం చేస్తామని వారన్నారు. కార్యక్రమంలో జిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్, కార్యదర్శి శ్రీ రామోజీ రాజు, కోశాధికారి కనపర్తి భాస్కరాచారి ఓదెల మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులు వెలుశో జు రవీంద్ర చారి . ప్రధాన కార్యదర్శి వెలుసోజు శ్రీధర్ . కోశాధికారి కొండపాక నరసింహాచారి . కోశాధికారి దేవరకొండ సతీష్ మండల కోశాధికారి . కొండపాక వరుణ్ చారి వెలుశో జు శ్రీనివాస , వెలుశోజు వెంకట రాజం, రమణయ్య, బ్రహ్మచారి శంకరాచారి నందయ్య చారి, దుశేటి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.