Rani Sushmita: ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా త‌నిఖీ చేయాలి

సిరాన్యూస్, కుందుర్పి
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా త‌నిఖీ చేయాలి
* సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
* కళ్యాణదుర్గం ఆర్‌డీఓ రాణి సుస్మిత
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా త‌నిఖీ చేయాలని కళ్యాణదుర్గం ఆర్‌డీఓ రాణి సుస్మిత అన్నారు.సోమ‌వారం డివిజన్ పరిధిలో లోని సెట్టూరు చెక్ పోస్ట్ (ఆంధ్ర కర్ణాటక బోర్డర్ చెక్ పోస్ట్ ), అయ్యగార్లపల్లి చెక్ పోస్ట్ లను సందర్శించారు. ఈసంద‌ర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున చెక్ పోస్ట్ నందు తనిఖీ లను సమర్ధవంతంగా చేపట్టాలని తెలిపారు. బాధ్యతల ప‌ట్ల‌ ఎలాంటి నిర్లక్ష్యం చూపకుండా విధులు చేపట్టాలని సంభందించిత అధికారులకు తెలియజేశారు. ఆమె వెంట‌ట‌ తహసీల్దార్, కళ్యాణదుర్గం వారు, ఎలక్షన్ డీటీ కళ్యాణదుర్గం డివిజన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *