Rani Sushmita:ఓట‌రుగా న‌మోదు చేసుకోవాలి

సిరా న్యూస్, కళ్యాణదుర్గం
ఓట‌రుగా న‌మోదు చేసుకోవాలి
*కళ్యాణదుర్గం ఆర్డీవో రాణి సుస్మిత
* ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ
18 సంవత్సరాల నిండిన ప్రతి యువతి, యువకులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డిఓ, రాణి సుస్మిత అన్నారు. ఓటు హక్కు వినియోగం పైన కళ్యాణదుర్గం ఆర్డీవో రాణి సుస్మిత ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు ‌. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డిఓ, రాణి సుస్మిత మాట్లాడుతూ… 2024 జనవరి కి 18 సంవత్సరాల నిండిన ప్రతి యువతి యువకులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని  పిలుపునిచ్చారు. ఓటర్లకు చేపట్టిన అవగాహన ర్యాలీ స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుండి వాల్మీకి సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది.  కార్యక్రమంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు, విద్యార్థులు బిఎల్వోలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *