సిరా న్యూస్, కుందుర్పి
కార్యక్రమాలు ముందుండి చూసుకోవాలి
రెవెన్యూ డివిజనల్ అధికారి డా. రాణి సుస్మిత
అధికారులు కార్యక్రమాలు ముందుండి చూసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి డా. రాణి సుస్మిత అన్నారు. గురువారం
నియోజకవర్గం పరిధిలోని అందరూ తహసీల్దార్ లు, మండల విద్యాధికారులు మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో రిటర్నింగ్ వారి కార్యాలయం లో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల విషయమై నియోజకవర్గం లోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల కమిషన్ సూచనల మేరకు పిడబ్ల్యుడి ఓటర్లకు పార్కింగ్ స్థలం, మొబైల్ బారికేడ్లు, ప్రత్యేక ప్రవేశం, పోలింగ్ బూత్లకు వెళ్లే మార్గం, చక్రాల కుర్చీలు, త్రాగు నీరు, బాత్ రూమ్స్, కరెంటు సప్లై, తదితర సౌకర్యాలతో పాటు కనీస సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని తెలిపారు.