ఆరేళ్ల చిన్నారిపై ఆత్యాచార యత్నం

సిరా న్యూస్,రాజేంద్రనగర్;
శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణంచోటుచేసుకుంది. శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలోని సిద్దాంతి వద్ద ఆరేళ్ల బాలికపై అత్యాచాయత్నం జరిగింది. బాలిక కుటుంబం వుంటున్న బిల్డింగ్ కింది పోర్షన్లో అద్దేకుంటున్న అంజనేయులు ఈ ఘాతుకానికి ఒడికట్టాడు. దేవరకద్ర మండలానికి చెందిన ఆంజనేయులు అతని కుటుంబంతో సిద్ధాంతిలో ఓ ఇంట్లో కింది పోర్షన్లో అద్దెకు ఉంటున్నాడు. సాయంత్రం స్నేహితులతో మద్యం తాగి ఇంటికివచ్చాడు. ఇతని భార్య ఓ పాస్ట్ పూడ్ లో పనిచెస్తుంది. సుమారు రాత్రి 8 గంటల సమయంలోఅమ్మవారి తొట్టెలు ఊరేగింపును చూసేందుకు బాధితురాలు రోడ్డుపైకి వచ్చింది. అమ్మాయిని ఆంజనేయులు తన రూంలోకి తిసుకేళ్ళి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. అమ్మయి అరుపులు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుడిని చితక బాది పోలీసులకు అప్పగించారు. అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఆంజనేయులుతో మద్యం తాగిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *