సిరా న్యూస్,మహబూబ్ నగర్;
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే పోరుదుమారం రేగింది. తాడూరు మండలం సిర్సవాడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల భవనంప్రారంభోత్సవ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారీ తీసింది. గత ప్రభుత్వ హయాంలోనాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా ఉన్న మర్రి జనార్థన్ రెడ్డి తన సొంత ట్రస్ట్ఎంజేఆర్ నిధులతో సిర్సవాడ గ్రామంలో ఉన్నత పాఠశాలను సుందరంగా నిర్మించారు.పాఠశాల భవనం నిర్మాణం ఇటీవలే పూర్తికావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్నివిద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే
కూచుకుళ్ల రాజేశ్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యేరాకముందే స్కూల్ భవనాన్ని మాజీ ఎమ్మెల్యే, ఎంజేఆర్ ట్రస్ట్ ఛైర్మన్ మర్రిజనార్థన్ రెడ్డి, తన అనుచరులతో కలసి ప్రారంభించారు. గతేడాది శంఖుస్థాపనసందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంతోనే పాఠశాల భవనాన్ని ఆవిష్కరించారు.
అనంతరం తరగతి గదులు, కార్యలయాలను సందర్శించి వెళ్లిపోయారు.అయితేకొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి,ఆయన అనుచరులు విద్యాశాఖ అధికారులను నిలదీశారు. ప్రోటోకాల్ ప్రకారంప్రభుత్వ పాఠశాల భవనాన్ని ప్రారంభించాలని ఆహ్వానం పలికి వేరే ఎవరో ఎలాప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు పాఠశాలప్రిన్సిపాల్, డీఈవోలతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రక్త పరిస్థితులుచోటుచేసుకున్నాయి. పోలీసుల జోక్యంతో అధికారులను అక్కడినుంచి తరలించిగొడవను సద్దుమణిగింపజేశారు. అయితే ఘటనపై విద్యాశాఖ అధికారులపై ఎమ్మెల్యేరాజేష్ రెడ్డి కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.అయితే జరిగినపరిణామాలపై డీఈవో గోవిందరాజులు వివరణ ఇచ్చారు. ఎంజేఆర్ ట్రస్ట్అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి ఆయన అనుచరులతోముందుగానే వచ్చి స్వయంగా తెచ్చుకున్న రిబ్బన్ ను పాఠశాల గేట్ కు కట్టిప్రారంభించారని చెప్పారు. అలాగే గతేడాది శంకుస్థాపనకు చెందిన శిలఫలకాన్నిఆవిష్కరించారన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి రిబ్బన్ కటింగ్ చేసినందునప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. తదుపరిప్రారంభోత్సవ కార్యక్రమ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని డీఈవో మీడీయాకుతెలిపారు.