Rathod Bapurao: స‌భ విజ‌య‌వంతానికి కార్య కర్తలు కృషి చేయాలి

సిరా న్యూస్,త‌ల‌మ‌డుగు
స‌భ విజ‌య‌వంతానికి కార్య కర్తలు కృషి చేయాలి
*  మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
గ్రామ స్థాయి నుండి జనాలను సమీ కరించి మోడీ సభను జయప్రదం చేసేలా కార్య కర్తలు కృషి చేయాలని బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. శ‌నివారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు, తాంసి మండలాల నాయకులతో ముఖ్యనాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడారు. ఈనెల 4న ఆదిలాబాద్ జిల్లా కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నారని తెలిపారు. గ్రామ స్థాయి నుండి జనాలను సమీ కరించి సభను జయప్రదం చేసేలా కార్య కర్తలు కృషి చేయాల‌ని సూచించారు. కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రాహ్మనంద్, తలమడుగు అధ్యక్షులు స్వామి, బీజేవైఎం అధ్యక్షులు కిరణ్, తాంసి మండల‌ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు ఏలేటి కిరణ్, సీనియర్ నాయకులు పడాల పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *