Rathod Ramesh: గోడం నగేష్‌ను ఎంపీగా గెలిపిద్దాం: మాజీ ఎంపీ రాథోడ్ రమేష్

సిరాన్యూస్‌, ఖానాపూర్
గోడం నగేష్‌ను ఎంపీగా గెలిపిద్దాం: మాజీ ఎంపీ రాథోడ్ రమేష్
* ఆయా గ్రామాల్లో విస్తృత ప్ర‌చారం

గోడం నగేష్‌ను ఎంపీగా గెలిపిద్దామ‌ని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. సోమ‌వారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో విస్తృత‌ ప్రచారం చేపట్టారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ , మాజి ఎంపీ రాథోడ్ రమేష్ తో కలిసి ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి, సుర్జాపూర్, మస్కాపూర్, గోసంపల్లే గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. గ్రామాలలోని వీధులలో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ, ఆప్యాయంగా పలకరిస్తూ, కమలం పువ్వు గుర్తును చూపిస్తూ ఓటేయాలని కోరతు ప్రచారాన్ని కొనసాగించారు. బాదనకుర్తి గ్రామంలో ఆటోలో కూర్చొని ప్రయాణీకులతో ముచ్చటించారు. సుర్జాపూర్ గ్రామాంలో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తో కలిసి ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోటికి చేరుకుని, ఉపాధి హామీ కూలీలతో ముచ్చటిస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటువేయాలని కోరారు. వికసిత్ భారత్ లక్ష్యంగా సుపరిపాలన అందజేస్తున్న నరేంద్రమోదీ ని మరో సారి ప్రధాని చేయడమే లక్ష్యంగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *