సిరా న్యూస్, బజార్హత్నూర్
జిల్లా వాసికి కాంస్య పతకం
* రాథోడ్ వనితను అభినందించిన కోచ్
జాతీయస్థాయిలో జరిగిన ఖేలో ఇండియా వూషు పోటీల్లో జిల్లా వాసికి కాంస్య పతాకాన్ని సాధించింది. అదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలానికి చెందిన రాథోడ్ వనిత ఈనెల 25 నుండి 27 వరకు రాంచీలో జరిగిన జాతీయస్థాయి ఖేలో ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. గతంలో తమిళనాడులో జరిగిన సౌత్ జోన్ సెలక్షన్స్ లో వెండి పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కాగా రాథోడ్ వనిత 75 కేజీ వెయిట్ కేటగిరి ఉమెన్స్ లీగ్ లో పాల్గొని మరో కాంస్య పతకాన్ని సాధించింది. ఈసందర్భంగా రాథోడ్ వనితను వూషూ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో సోహెల్ అహ్మద్ , ఆమెచర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రెటరీ అబ్దుల్ ఉమార్ , కోచ్ అన్నారపు వీరేష్ అభినందించారు.