సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేటలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. సినిమా స్టైల్లో కొరియర్ కంటైనర్ లో అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్నారు. దుబ్బాక (మం) మర్రికుంట వద్ద డివైడర్ ని ఢీ కొట్టి కొరియర్ వాహనం బోల్తా పడడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసి డ్రైవర్ పారిపోవడంతో అనుమానం వచ్చి కంటైనర్ డోర్లు ఓపెన్ చేయగా రేషన్ బియ్యం కంటపడింది. కొరియర్ మాటున రేషన్ బియ్యం తరలిస్తుండటంతో షాక్ అయిన పోలీసులు…నిందితుల కోసం గాలిస్తున్నారు.
======================