Ravi Bandi:ప్రజలకు మంచి సేవలు అందించాలి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ప్రజలకు మంచి సేవలు అందించాలి
* ఈడీఎం రవిబండి
* మీసేవ సెంటర్ల తనిఖీ
ప్రజలకు మంచి సేవలు అందించాలని ఈడీఎం రవిబండి అన్నారు. రాష్ట్ర ఈ.యస్.డి. మీసేవ కమిషనర్ రవికిరణ్ ,యస్.పి.యం. నర్సింహా బజ్జురి ఆదేశాల మేరకు మంగ‌ళ‌వారం అదిలాబాద్ లో పలు మీసేవ సెంటర్ లను ఈడీఎం రవిబండి తనిఖీ చేశారు. మునిసిపల్ రమాదేవి, ద‌స్నాపూర్ బిస్మిల్లా, భుక్తాపూర్‌ శ్రీధర్, భాస్కర్, గోవర్ధన్ సెంటర్ ల వారి పనితీరు ప‌రిశీలించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రజలకు మంచి సేవలు ఇవ్వాలని సూచించారు. జాబ్స్ నోటిఫైకేషన్ వస్తున్న నేపథ్యంలో సిటిజన్స్ యొక్క కరెక్ట్ డాక్యుమెంట్స్ అప్డేట్ చేయాలని వివరించారు.ఎటువంటి అధిక రుసుం తీసుకోకుండా సరైన‌ సర్వీస్ లను ప్రజలకు అందించాల‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *