సిరా న్యూస్, ఓదెల
సమాజాన్ని తీర్చిదిద్దే శక్తి కవిత్వానికే ఉంది
*ప్రపంచ కవిత్వ దినోత్సవం
కవులు, కళాకారులకు గత ప్రభుత్వం పెద్దపీట వేసింది . హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలు కార్యక్రమం చేపట్టడంతో మారుమూలన ఉన్న కవులు కళాకారులకు మంచి గుర్తింపు వచ్చింది .సమ సమాజాన్ని తీర్చిదిద్దే శక్తి ఒక కవిత్వానికే ఉంది కవిత్వమే ఒక సందేశం కవిత్వం అనేది మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది కొత్త పదాల కలయికే కవిత్వం. మనిషి పుట్టినప్పటి నుండి మరణించే వరకు కవిత్వంతో ముడిపడి ఉంది మనిషి జీవితం . ప్రపంచ కవిత్వా దినోత్సవ సందర్భంగా నేను రాసిన కవిత ఎక్కడుంది. లోపం ఏమవుతుంది. ఈ లోకంఏమో ఈ ప్రపంచమంతా ఎటుపోతుందమ్మో కత్తుల తోనే వంతెన వేసే కసాయి మూకమ్మో.
నీరు లేని ఊట బావులనడుగు…
చుక్క లేని సెల ఏరునడుగు…
ఎండుతున్న అపంటలనడుగు….
ఎగురుతున్న పాలపిట్ట నడుగు…
ఎక్కడుంది లోపం ఏమౌ తుందో లోకం..
కౌలు రైతుల చావులనడుగు …
కంటిలోని కనుపాపను అడుగు.
గుండెలోని అశ్వాసను అడుగు…
పండు టాకు ముసల్లోల్లను అడుగు…
ఎక్కడుంది లోపం ఏమౌతుం దొ లోకం…
నింగిలోని అమబ్బులనడుగు….
పేదవాడి ఆకలిని నడుగు…
గర్భ గుడిలో నీ దేవుణ్ణి న డుగు…
గాడితప్పిన వ్యవస్థ న డగు….
ఎక్కడుంది లోపం ఏమౌతుం దొ లోకం…
దుక్కి దున్నే రైతును అడుగు…
చదువుకున్న నిరుద్యోగి నీ అడుగు…
దగాపడ్డ కళా కారున్ని అడుగు…
గడచిపోయిన గతాన్ని అడుగు…
ఎక్కడుంది లోపం ఏమౌతుం దొ లోకం..
రచన: బ్రా హ్మండ్ల పల్లి రవీంద్రా చారి .కవి (గవర్నర్ అవార్డ్ గ్రహీత)
ఇంటి నెంబర్.10_11/19. అఆర్టీజన్ కాలనీ.గ్రా. మండలం.ఓదెల.
జిల్లా.పెద్దపల్లి.