సిరా న్యూస్,తుగ్గలి;
తుగ్గలి మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని ఈనెల 8న పత్తికొండలోని ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి శ్రీరాములు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు శనివారం రోజున మండల కేంద్రమైన తుగ్గలిలోని సిపిఎం మండల కార్యదర్శి శ్రీరాములు రైతులకు ఆర్డిఓ కార్యాలయం ముట్టడి కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరము ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన వర్షాలకు రైతులు విత్తనాలు వేశారని,విత్తనం వేసిన తరువాత వర్షాలు రాక వేసిన పంటలు ఎండిపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగి అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యల వైపు దారితీసే ప్రమాదం ఉందని,ఈ సందర్భముగా ప్రభుత్వం కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించడం జరిగింది.అయితే జిల్లాలో కేవలం కర్నూలు రూరల్ తుగ్గలి మండలాలను మాత్రం కరువు
ప్రకటించలేదన్నారు.అందువల్ల సి.పి.ఐ, సి.పి.యం,టి.డి.పి,జనసేన,కాంగ్రెస్ పార్టీలు, రైతు సంఘాలు,ఇతర ప్రజా సంఘాలు తుగ్గలి మండలాన్ని కరువు మండలముగా ప్రకటించాలని సచివాలయాలు,తహశీల్దారు
కార్యాలయం,ఆర్.డి.ఓ. కార్యాలయాల వద్ద ధర్నాలు,వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దీనితోపాటు కొనసాగింపుగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు తుగ్గలిలో 3గంటల పాటు నవంబరు 3వ తేదీన ఆందోళన చేయగా
అధికారులు కరువు మండలముగా ప్రకటిస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరియు నవంబరు 14 తేదీన కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వగా తుగ్గలి మండలాన్ని
కరువు మండలముగా ప్రకటించాలని పై అధికారులకు సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారని,కానీ ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాలేదన్నారు.అంతేగాక డిసెంబరు 4,5వ తేదీలలో తుగ్గలి మండల కార్యాలయం ముందు నిరాహారదీక్ష చేపట్టడం జరిగిందని,డిసెంబర్ 5వ తేదీ మండల పరిషత్ మీటింగ్లో ఆందోళన చేసి కరువు మండలంగా ప్రకటించాలని మండల తీర్మాణం చేయించడం జరిగిందన్నారు.అంతేగాక డిసెంబర్ 13వ తేదీ కరువు పరిశీలన నిమిత్తం ఢిల్లీ నుండి వచ్చిన బృందాన్ని జొన్నగిరిలో అడ్డగించి నిరసన తెలియచేయడం జరిగిందని,డిసెంబర్ 23వ తేదీన అఖిలపక్ష పార్టీలు,రైతు సంఘాలు,ప్రజా సంఘాలు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తాళం వేసి 4 గంటల పాటు రాస్తారోకో నిర్వహించి రోడ్డు నిర్బంధం చేయడం జరిగిందన్నారు.తుగ్గలి మండలంలో నెలకొన్న తీవ్ర కరువును గురించి వివిధ రూపాలలో ఆందోళనలు చేసినా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదని,కావున జనవరి 8వ తేదీన సి.పి.ఐ,సి.పి.యం,టి.డి.పి,జనసేన, కాంగ్రెస్ పార్టీలు,రైతు సంఘాలు,ఇతర ప్రజా సంఘాలు కలసి పత్తికొండ ఆర్.డి.ఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు,రైతులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అయన రైతులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి మండలానికి సంబంధించిన రైతులు తదితరులు పాల్గొన్నారు.