సిరాన్యూస్, కుందుర్పి
ఆర్డీటీ సంస్థ పై బీజేపీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
ఆర్డీటీని కాపాడుకోవడమే మా ధ్యేయం
ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు
కరువు జిల్లాలో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన సంస్థ ఆర్డీటీ సంస్థపై బీజేపీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు అన్నారు. బుధవారం కేంద్రంలోని బి అర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ ,ఎస్టీ జేఏసీ మండల అధ్యక్షుడు డాబా రమేష్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చెందిన ఎఫ్సీఆర్ ఏ ను రెన్యువల్ చేయాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో విద్య,వైద్యం సామాజిక రంగాల్లో నిరుపేద ప్రజలకు సేవలందిస్తున్న ఆర్డిటి సంస్థకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ప్రజలంతా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా బస్సు ఉందన్నారు.ప్రతి ఒక్కరు నడుం బిగించి ఆయా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపాలని వారు పిలుపునిచ్చారు.ఇప్పటికే జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి గారు నిరసన దీక్ష చేయడం జరిగిందన్నారు.అదే బాటలో గ్రామీణ ప్రాంతాల్లోనీ ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ కి నిలుపుదల చేసిన దాతల నిధుల దక్కించుకోవడానికి ఉద్యమం చేయాలన్నారు.పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసిన పాదర్ విన్సెంట్ పెర్రార్ ను మరచిపోరాదన్నారు.దళిత, గిరిజనుల్లో మరింత అభవృద్ధి,చైతన్యం రావాలంటే ఆర్డీటీ తోనే సాధ్యమన్నారు.అందుకే ఆర్డీటీ నీ కాపాడుకోవడం మనందరి బాధ్యత కావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ జేఏసీ ఉపాధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి నాగరాజు పలువురు, మహిళలు ప్రజలు పాల్గొన్నారు.