సిరా న్యూస్,కోనసీమ;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏది నిర్దేశిస్తే ఆ పని చేస్తానని అమలాపురం తాజా ఎంపీ అభ్యర్థి గెలుపొందిన గంటి హరీష్ మాధుర్ బాలయోగి అన్నారు. కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. దివంగత లోక్సభ మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి తనయుడు హరీష్ మాధుర్. అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి తొలిసారిగా ఆయన ఎంపీగా గెలిపొందారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ఏ బాధ్యతలు అప్పగించిన దానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
=========================