సిరా న్యూస్,కడప;
బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను కడప జిల్లా పోలీసులు రికవరీ చేసారు. వీటి విలువ రెండు కోట్లుంటుంది. శుక్రవారం నాడు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సెల్ ఫోన్ లను అందజేసారు.
ఎస్పీ మాట్లాడుతూ సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా ఉంటే సి.ఈ. ఐఅర్ పోర్టర్, పోలీస్ స్టేషన్ ల ద్వారా కేసు నమోదు చేసుకోవచ్చు. సెల్ ఫోన్ లు దొంగతనాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. సెల్ ఫోన్లను రశీదు చూసి కొనాలని సూచించారు. .