ప్రతి ఏటా నియామక ప్రక్రియ

అభయహస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సిరా న్యూస్,హైదరాబాద్;
నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అభయహస్తం ప్రారంభోత్సవం లో అయన మాట్లాడారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత.అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది.యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశాం. గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వాహించాం..డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయని అన్నారు.
నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్2 పరీక్ష వాయిదా వేశాం. ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే. పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నాం. ఇక నుంచి ప్రతీ ఏటా మార్చ్ లోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుంటాం. జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థకు అభినందనలని అన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *