సిరాన్యూస్, జైనథ్
బాధిత కుటుంబాలకు దుప్పట్లు అందజేసిన రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మేడిగూడ (ఆర్) గ్రామంలో ఇటీవల గాలివాన భీభత్సవం సృష్టించింది. దీంతో గ్రామంలో పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. ఈవిషయం తెలుసుకున్న రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు శుక్రవారం సుమారు 20 బాధిత కుటుంబాలకు టార్పలీన్స్ ,దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఐఆర్సీఎస్ చైర్మన్ ఎస్ గంగేశ్వర్, స్టేట్ ఎంసీ మెంబెర్ విజయ్ బాబు , జైనథ్ మండల కోఆర్డినేటర్ క్యాతం శివప్రసాద్ రెడ్డి, ఆదిలాబాద్ కోఆర్డినేటర్ లు నరేష్, ప్రవీణ్, ఉప్పాల కిషన్ రావు, కళ్లెం రాంరెడ్డి, ఉయిక దేశ రావు, తదితరులు పాల్గొన్నారు.