చిగురుమామిడి, సిరా న్యూస్
మిలీనియం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో పాలకవర్గానికి సన్మానం
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామ పాలకవర్గం గత ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేకొండ మిలీనియం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డ్ సభ్యులకు శాలువాaతో సన్మానం చేశారు. ఐదు సంవత్సరాలు తమ పరిపాలన ద్వారా ప్రజల మన్ననలు పొందారని గుర్తుచేశారు. కార్యక్రమంలో పిట్టల రజిత శ్రీనివాస్, ఎంపీటీసీ కొత్తూరు సంధ్య రమేష్, చాడ శోబా ప్రభాకర్ రెడ్డి, వార్డ్ సభ్యులు,యూత్ సభ్యులు కార్యక్రమంలో మిలీనియం సభ్యులు తిప్పారపు సురేష్, చిప్ప తిరుపతి, మహిపాల్ రెడ్డి, గందే చిరంజీవి, దుడ్డేల శ్రీనివాస్, తీగల శ్రీనివాస్, గండ్రతి సురేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.