సిరా న్యూస్,తిరుమల;
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు, దర్శన విధానంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు..ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ
అయోధ్యలో 22వ తేదీ శ్రీ రామచంద్రులవారి విగ్రహ ప్రతిష్ట, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.తిరుపతిలోని అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులు తిరుమలలో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లో టికెట్ (రూ.300/-) కొనుగోలుచేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15వ తేదీ తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు ‘‘శ్రీ గోదా కళ్యాణం’’ వైభవంగా నిర్వహిస్తామన్నారు.శ్రీవారి భక్తులు టిటిడి పేరిట ఉన్న నకిలీ వెబ్ సైట్ల కారణంగా మోస పోకూడదనే ఉద్దేశంతో టిటిడి అధికారిక వెబ్ సైట్ ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జిత సేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని భక్తులను కోరారు. తిరుమల లో జనవరి 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం, జనవరి 25న శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు.