ఎమ్మిగనూరు టిడిపి అభ్యర్థి బి వి జయనాగేశ్వర రెడ్డి
సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
పింఛన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు 13 వేల కోట్లు మార్చి 16-30 తేదీల మధ్యలో ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు దోచి పెట్టిన జగన్మోహన్ రెడ్డి : ఎమ్మిగనూరు టిడిపి అభ్యర్థి బి వి జయనాగేశ్వర రెడ్డి
జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 1వ తారీకు పింఛన్లు పంపిణి చేయాలని ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు : ఎమ్మిగనూరు టిడిపి అభ్యర్థి డా బి వి జయనాగేశ్వర రెడ్డి
ఎమ్మిగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి వి జయనాగేశ్వర రెడ్డి స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని MPDO కార్యాలయంలో ఎమ్మిగనూరు మండల పరిషద్ అభివృద్ధి అధికారి గారిని కలిసి వృద్దాప్య, వికలాంగ, వితంతు పెన్షన్ లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగించకుండా సచివాలయ సిబ్బంది మరియు గ్రామ కార్యదర్శులతో పింఛన్లు పంపిణి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుండి వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ సుమారు నెల రోజుల ముందే ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. వారికి ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిందని, ఈ నేపథ్యంలో పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆదేశాలిచ్చారు అని ఆయన గుర్తు చేశారు. ఆ పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దనే లబ్దిదారులకు పంపిణీ చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో పింఛన్ల పంపిణి చేయించకపోవడానికి నిధుల కొరతే అయితే గాని, ఎన్నికల కమీషన్, తెలుగుదేశం పార్టీ కాదని గుర్తు చేశారు. పింఛన్ల సొమ్ముతో పాటు ప్రభుత్వ నిధులు 13 వేల కోట్లు మార్చి 16-30 తేదీల మధ్యలో ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 1వ తారీకు పింఛన్లు పంపిణి చేయాలని ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శుల సేవలను వినియోగించుకుని లబ్దిదారులకు ఇళ్ల వద్దనే అందించాలని ఆయన MPDO కి వినతి పత్రం అందించి డిమాండ్ చేశారు.