సంక్రాంతి బోనస్ చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి

పండుగ బోనస్ చెల్లింపుకు తగిన చర్యలు చేపడతామని కమిషనర్ హామీ

 సిరా న్యూస్,బద్వేలు;
బద్వేలు మున్సిపల్ వర్కర్స్@ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె సందర్భంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంగీకరించిన ఒప్పందాల మేరకు సంక్రాంతి బోనస్ చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కె. నాగేంద్రబాబు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో పనిచేస్తున్న మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2023 వ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ నుండి 2024వ సంవత్సరం జనవరి 10వ తేదీ వరకు 16 రోజులపాటు నిర్వహించిన రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె సందర్భంగా మున్సిపల్ రాష్ట్ర నాయకత్వంతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పలుదా పాలు చర్చలు నిర్వహించిన సందర్భంగా సంక్రాంతి పండుగ పురస్కరించుకొని కాంట్రాక్ట్- ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగ కార్మికులందరికీ ఒక్కొక్క కార్మికునికి 1,000/- రూపాయలు చొప్పున పండుగ బోనస్ చెల్లిస్తామని అంగీకరించియుండి ఆ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు జీ.వో.ఎం.ఎస్ నెంబర్ 12, తేదీ 23-01- 2024న జారీ చేయడం జరిగిందని ఆ ఉత్తర్వుల మేరకు బద్వేల్ పురపాలక సంఘంలోని కార్మికులందరికీ పండుగ బోనస్ మంజూరు చేయాలని కోరగా
స్పందించిన మున్సిపల్ కమిషనర్
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కార్మికులందరికీ 1,000/- రూపాయలు మంజూరు చేయుటకు తగిన చర్యలు ప్రారంభిస్తామని కమిషనర్ గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ పట్టణ అధ్యక్షులు పులి శ్యాం ప్రవీణ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు దియ్యాల హరి, కార్యదర్శులు నాగరపు సత్యరాజు, బద్వేల్ ప్రవీణ్ కుమార్, కోశాధికారి కాలువ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *