సిరా న్యూస్,విజయవాడ;
కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం పెద్ద ఓగిరాల గ్రామంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. 22 మంది వాలంటీర్లు కార్యదర్శికి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. వాలంటీర్ల పై చంద్రబాబు నాయుడు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాడని అవ్వ తాతలకు ,వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇస్తుంటే ఓర్వలేక పోతున్నాడు గతంలో కూడా వారంటీలపైన విషప్రచారం చేశాడు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని మళ్లీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత వాలంటీర్లు మళ్ళీ ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తామని తెలిపారు.
==================